సిద్దిపేట, డిసెంబర్ 3 : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో దివ్యాంగుల ఎంపిక శిబిరాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ, ఏఐఎల్ఎంసీ ఆధ్వర్యంలో బ్యాటరీ ట్రైసైకిళ్లు, కాలిపర్సు, కృత్రిమ కాళ్లు అందజేయనున్నారు. శిబిరానికి దివ్యాంగులు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, సదరం సర్టిఫికెట్, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని నిర్వాహకులు కోరారు. శిబిరంలో బ్యాటరీ ట్రై సైకిళ్లు, కాలిపర్సు, కృతిమ కాళ్లు, వినికిడి యంత్రాలను అందజేయనున్నారు. ఇందుకు అర్హత గల దివ్యాంగులు మాత్రమే హాజరు కావాలని కోరారు.
శారీరక దివ్యాంగులు దిగువ అవయవాల్లో (కాళ్లలో) తీవ్రమైన వైకల్యం కలిగి ఉండి, ఎగువ అవయవాలు (రెండు చేతులు)మంచి స్థితిలో (సాధారణంగా) ఉండి వాహనం నడుపగలిగి ఉండేవారు అర్హులు. వైకల్యశాతం 80 శాతం ఉండాలి. వయస్సు 16 ఏండ్లు పైబడి ఉండాలి. కుటుంబ నెలసరి ఆదాయం రూ. 15వేలు మించకుండా ఉండాలి. ప్రభుత్వ దివ్యాంగుల సహకార సంస్థతో ఇదివరకే మోటోరైజేడ్ వాహనం పొందినవారు ఈ ట్రై సైకిళ్లు పొందేందుకు అనర్హులు..
శారీరక దివ్యాంగులు కాళ్లు పోలియో, మస్తిష్క పక్షవాతం కలిగిన వారు అర్హులు. ఈ శిబిరంలో కేవలం కొలతలు మాత్రమే తీసుకోబడును.
శారీరక దివ్యాంగులు కాళ్లు తొలిగించబడినవారు కృతిమ కాళ్లు అమర్చడానికి అర్హులు. ఈ శిబిరం కొలతలు మాత్రమే తీసుకుంటారు. తదుపరి వాటిని తయా రు చేసి అమర్చడానికి మరో శిబిరం (ఫిట్మెంట్ క్యాంప్) ఏర్పాటు చేసి తెలియజేయబడును.
బధిర దివ్యాంగులు ఎవరైతే 51శాతం నుంచి 75 శాతం లోపు వినికిడి లోపం గల వారికి వినికిడి యం త్రాల కోసం ఎంపిక చేయనున్నారు.