మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 4: క్యారెల్స్ సండే పురస్కరించుకుని ఆదివారం మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా సీఎస్ఐకి చెందిన పలు విద్యాసంస్థలు, వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులు, సండే స్కూల్ చిన్నారులు ఏసయ్య భక్తిగీతాలు ఆలపిండంతో పాటు యేసయ్య పుట్టుపుర్వోత్తరాలు తెలిసే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్కు ముందు వచ్చే డిసెంబర్ మాసంలోని తొలి ఆదివారం క్యారెల్స్ సండే నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా బిషప్ రెవరెండ్ సాలోమాన్రాజ్ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రార్థనల అనంతరం ఏసయ్యకు మొక్కుకున్న తమ తమ మొక్కులను తీర్చుకుని చర్చి ఆవరణలోని వసతి గృహాలతో పాటు చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి జార్జి ఎభినేజర్ రాజు, పాస్టర్లు డేవిడ్, జైపాల్, సువర్ణలు భక్తులను ఆశీర్వదించారు. ప్రార్ధనల్లో సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలండ్పాల్, వికాస్, సువన్ డగ్లస్, సంశాన్ సందీప్, జాయ్ముర్రే, అనూప్లతో పాటు భక్తులు పాల్గొన్నారు.