హుస్నాబాద్, ఏప్రిల్ 9: శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉగాది పం డుగ సందర్భంగా హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమంతోపాటు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని భవానీ సమిత కాశీమరకత లింగేశ్వరాలయంలో జరిగిన సామూహిక ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉగాది పచ్చడిని అందరికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవాలన్నారు. ఉగాది షడ్రుచుల్లాగా జీవితంలో కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలుగుతుంటాయని, అన్నివేళల్లో అందరితో కలివిడిగా ఉండి ముందుకు పోతే జీవితం సుఖమయంగా సాగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, మాజీ చైర్మన్ సుద్దాల చం ద్రయ్య, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, బోజు రమాదేవి, వాల సుప్రజ, కోమటి స్వర్ణలత, వల్లపు రాజు, పున్న లావణ్యసది, గోవిందు రవి, బొల్లి కల్పనశ్రీను, అయిలేని శంకర్రెడ్డి, ఎండీ అయూబ్, చిట్టి గోపాల్రెడ్డి, ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, పందిల్ల శంకర్, గాదెపాక రవీందర్ పాల్గొన్నారు.
డివిజన్లో ఘనంగా ఉగాది వేడుకలు
హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది పం డుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ఇండ్లకు మామిడి తోరణాలు, పూల దండలు కట్టుకొని ఇండ్లలో ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పచ్చడి, భక్షాలు చేసుకొని కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు. డివిజన్ పరిధిలోని పలు దేవాలయాలు ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి.