సిద్దిపేట, డిసెంబర్ 2: సిద్దిపేట పట్టణంలోని ‘శ్రీకృష్ణ కాలచక్రం’ పరిపూర్ణమైంది. గత నెల 19న ప్రారంభమైన అయుత చండీ, అతిరుద్ర యాగం, సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, 78వ విశ్వశాంతి మహాయాగం శుక్రవారం ముగి సింది. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూ పానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్య క్రమం కన్నుల పండువగా సాగింది. అయుత చండీ..అతిరుద్ర యాగ ఘట్టం 15 రోజుల పాటు ఆత్యంత వైభవంగా జరుగగా, చివరి రోజు కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల తన్నీరు హరీశ్రావు దంపతులు పాల్గొన్నారు. చివరి రోజు గురుపూజ, మహాపూర్ణాహుతి, తులాభారం, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారికి తులాభారం, గురుపూజ నిర్వహించారు. గోపూజ, తులసిపూజ, సహస్ర లింగార్చన, రుద్రాభిషేకాలు, కోటి పారాయణ భజనలు, లక్ష బిల్వార్చన, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. 17 రకాలైన జప, పారాయణ, ఆభిషేక హోమాలు చేశారు. చివరి రోజు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శ్రీరాధాకృష్ణ శాంతి కల్యాణ మహోత్సవం జరిపారు.
లోక కల్యాణం కోసం చేపట్టిన ఈ మహారుద్ర హోమంతో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందేలా, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అత్యద్భుతంగా చండీయాగం జరిగిందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో 165 అడుగుల పాలరాతి రాధాకృష్ణ విగ్రహంతో కూడిన మందిరాన్ని నిర్మిస్తామని, దీనికి వచ్చే ఫిబ్రవరిలో సన్నాహాలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలం దరూ ఆయురారోగ్యాలతో ఐష్టెశ్వర్యాలతో సుఖ సంతోషాలు ప్రసాదించేలా స్వామి వారిని వేడు కున్నట్లు మంత్రి తెలిపారు.