సంగారెడ్డి, జనవరి 10 : జిల్లాలో మృతుల అంతిమ సంస్కారాలు గౌరవ ప్రదం గా నిర్వహించేందుకు ప్రభు త్వం వైకుంఠ రథాలు, బాడీ ఫ్రీజర్లు అందుబాటులోకి తె చ్చిందని కలెక్టర్ శరత్కుమా ర్ నాయక్ వివరించారు. మంగళవారం కలెక్టర్ మా ట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అందుబాటులో వైకుంఠ రథాలు, బా డీ ఫ్రీజర్లు ఉన్నాయని, అవసరం వచ్చినపుడు వాటిని వినియోగించుకుని అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. నాలుగు నుంచి ఆరు గ్రామాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు మధ్యన ఉన్న గ్రామంలో వైకుంఠ రథం ఉంటుందన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలు గ్రామ పంచాయతీ కార్యుదర్శులు పర్యవేక్షించాలన్నారు. జిల్లా ప్రస్తుతం 70వైకుంఠ రథాలు, 64బాడీ ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైన పేద ప్రజలు మృతి చెందితే వైకుంఠ రథాన్ని ఉపయోగించు కోవాలన్నారు. ఫ్రీజర్ను వినియోగించుకోవాలని కోరా రు.
ఇందుకోసం గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో గోడలపై వైకుంఠ రథం ఉన్న గ్రామం పేరు, సర్పంచ్, కార్యదర్శి పేరుతో పాటు ఫోన్ నంబర్లు రాయించామన్నారు.అంతేకాకుండా గ్రామంలో వైకుంఠధామం రిజిస్టరు పెట్టి మృతి చెందిన వారి వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. వైకుంఠ రథాలను వినియోగించుకోడానికి ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామాల్లోని గో డలపై స్లోగన్లు రాయించామన్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం సర్పంచ్ 10వైకుంఠ ర థాలు, బొంతపల్లి సర్పం చ్ 5, కోవలెంట్ సంస్థ, ఎంఎస్ఎన్ పరిశ్రమ, పిరమిల్ పరిశ్రమలు ఇం కా కొంతమంది ముం దు కొచ్చి వైకుంఠ రథా లు, బాడీ ఫ్రీజర్లు బహుకరించారన్నారు.