జహీరాబాద్, మార్చి 11: కర్ణాటక శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ- కర్ణాటక పోలీసులు సహకరించుకోవాలని కలబుర్గా అదనపు ఎస్పై శ్రీనిధి తెలిపారు. శనివారం కలబురా జిల్లాలోని చించొలి సబ్డివిజన్ కేంద్రంలో రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. అంతరాష్ట్ర నేరాస్తులు, మిస్సింగ్ కేసులు, గుర్తు తెలియని శవాలు, నాన్ బెయిలబుల్ వారెంట్లపై సమీక్షించారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ర్టాల పోలీసులు సమన్వయంతో పని చేసి, శాంతి భద్రతలను కాపాడాలన్నారు. సమావేశంలో చించొలి డీఎస్పీ ఉజ్జనప్ప, జహీరాబాద్ సీఐ తోట భూపతి, సంగారెడ్డి డీసీఆర్బీ సీఐ బి. రమేశ్, చిరాగ్పల్లి ఎస్ఐ. కాశీనాథ్, వికారాబాద్, నారాయణపేట, చించొలి సబ్ డివిజన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.