రాయికోడ్, మార్చి 15 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రజా ప్రతినిధులు,అధికారులు కృషిచేయాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. బుధవారం రాయికోడ్ మండల ప్రజాపరిషత్ సర్వసభ సమావేశం ఎంపీపీ మమత అశోక్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలను అం దించాలన్నారు. మండలానికి ఎస్ఈర్జీఎస్లో రూ. 3.15 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళలకు రూ. 2 కోట్ల వడ్డీలేని రుణాలు మం జూరు చేసినట్లు తెలిపారు. అనంతరం రాయికోడ్లో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మండల పరిధిలోని ఇందూర్లో పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో జడ్పీటీసీ మల్లిఖార్జున్పాటిల్, అత్మ కమిటీ చైర్మన్ విఠల్, తహసీల్దార్ ప్రభు, ఎంపీడీవో వెంకటేశం,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి శంకర్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ప్రశాంత్పాటిల్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సిద్దన్నపాటిల్, వరం వైస్ చైర్మన్ తుకారం, మం డల స్థాయి అధికారులు శశికుమార్, జానకిరాం, తహా, ముక్రిద్, నర్సింహులు, డాక్టర్ హర్షవర్ధన్రెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్, అవినాశ్వర్మ, విష్ణు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ‘కంటి వెలుగు’
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 15 : కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మెదక్ జిల్లాలో బుధవారం కొనసాగింది. 38 రోజులుగా జిల్లాలో 2,22,417 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,05,488 మంది పురుషులు, 1,16,929 మంది మహిళలు ఉన్నారు. 24,109 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 22,758 మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. బుధవారం జిల్లాలో 39 శిభిరాల ద్వారా 6,001 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందు లో 615 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 556మంది అద్దాలకు ఆర్డర్ ఇచ్చనట్లు డీఎంహెచ్వో తెలిపారు.
కంది, మార్చి 15 : సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నది. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 64 కంటి వెలుగు శిబిరాల్లో 17337 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1206 చదవడానికి వీలుగా ఉండే కంటి అద్దాలను పంపిణీ చేయగా, డిస్కిప్షన్ ప్రకారం 1035 మందికి అద్దాలను అందజేశారు. 1435 మందికి ఆపరేషన్లకు గాను ఇతర దవాఖానలకు సిఫారసు చేశారు.
పటాన్చెరు, మార్చి 15: చిట్కుల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వేణుగోపాలస్వామి దేవాలయం విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో వేణుగోపాలస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ పూజల్లో గూడెం మహిపాల్రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, కొలన్బాల్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, నగేశ్, నరేందర్రెడ్డి, తొంట అంజయ్య యాదవ్, గోపాల్రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.