చిన్నశంకరంపేట/ టేక్మాల్, డిసెంబర్ 7 : చిన్నశంకరంపేట గ్రామశివారులోని అనంతపద్మనాభస్వామి గుట్టపై జగద్గురు దత్తాత్రేయస్వామి 42వ వార్షిక సద్గురు ఆరాధన ఉత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచల బోదానందయోగేశ్వర భూమినాదం మహారాజ్ ఛాయపటాన్ని గుట్ట నుంచి ఊరేగింగి, కామధేను యజ్ఞాన్ని నిర్వహించారు. సమీప ప్రాంతాలను భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. చిన్నశంకరంపేటలోని సా యిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీజ్ఞానానంద జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్గొన్నారు.
పౌర్ణమి సందర్భంగా టేక్మాల్లోని రాజరాజేశ్వరీ ఆలయం లో భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. దీపాలంకరణతో ఆలయాలు శోభాయమానంగా వెలుగొందాయి.
నర్సాపూర్, డిసెంబర్ 7 : అయ్యప్ప స్వామి హరివరాసనం శత జయంతి మహోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్ అశోక్గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్గౌడ్ మాట్లాడుతూ ఉతవాలకు ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హాజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు శివాలయం నుంచి అయ్యప్ప స్వామి (పల్లకి సేవ) ఊరేగింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నం అయ్య ప్ప ఆలయంలో మహాపడి పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రామాయంపేట, డిసెంబర్ 7 : పట్టణంలో 14 మంది అయ్యప్పస్వాములు రుముడితో శబరిమలైకి బయలు దేరారు. గురుస్వామి పల్లె జితేందర్గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంబాకు వెళ్లినవారిలో స్వాములు బాసం శ్రీనువాస్, మద్దెల స్వామి, బొద్దుల సాగర్, మద్దెల భరత్, భాను, మద్దెల సాయిచరణ్ తదితరులు ఉన్నారు.
చేగుంట మండలం పోలంపల్లిలో జరిగే మహాపడి పూజకు హాజరుకావాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ గురుస్వామిని అయ్యప్పస్వాములు ఆహ్వానించారు. చేగుంట మండలం పోలంపల్లికి చెందిన అయ్యప్ప స్వాములు ర్యాపాకుల ఎల్లాగౌడ్ ఈ నెల 17న పోలంపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మహాపడి పూజ నిర్వహిస్తున్నారు. 18వ పడిపూజకు ముఖ్య అతిథిగా మేడ్చల్ నుంచి తాళ్లపల్లి రాజేశ్వర్, సంకెపల్లి భరత్కుమార్ వస్తున్నట్లు పేర్కొన్నారు.
చేగుంట, డిసెంబర్ 7 : మండలంలోని కర్నాల్పల్లికి చెంది న కన్నెస్వామి పత్రాల సాయికుమార్గౌడ్ పడిపూజ నిర్వహిం చారు. గురుస్వాములు భరత్కుమార్శర్మ, రాజశేఖర్శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గురుస్వాము లు, గిరి, రాములు, ఎల్లం, రవి, సాయికుమార్ పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట, డిసెంబర్ 7 : జిల్లా కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహించారు. భక్తితోనే మానసిక ప్రశాంతత లభి స్తుందని ప్రధాన అర్చకుడు పాండురంగశర్మ పేర్కొన్నారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశే ష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం హోమం నిర్వహించి, భక్తులకు అన్నాదానం చేశారు. సాయంత్రం దత్తాత్రేయ స్వామివారి విగ్రహాన్ని ప్రధాన వీధుల్లో ఊరేగించారు.
పెద్దశంకరంపేట పట్టణంలోని మాణిక్ప్రభు, ప్రియాంకకాలనీలోని సంతోషీమాత, గొట్టిముక్కులలోని దత్తాత్రేయ ఆలయాల్లో దత్తజయంతి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్, వైస్ఎంపీపీ లక్ష్మీరమేశ్, పూజారులు కృష్ణశర్మ, మహేశ్, అభిలాష్, రంగన్న, ఆలయ కమిటీ బాధ్యులు రామలింగం, దయానంద్, రామన్న, సర్వేశ్వర్, నర్సింహులు, నాయకులు పున్నయ్య, గంగాధర్, కృష్ణమూర్తి, దత్తు, ప్రభు పాల్గొన్నారు.