మెదక్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ టి.ఎన్.స్వామి అన్నారు. మంగళవారం నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ఆధ్వర్యంలో మెదక్లోని స్థానిక సిల్ డెవలప్మెంట్ సెంటర్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ స్వామి మాట్లాడుతూ ఎయిడ్స్కు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం, నివారించడం, పరిషరించడంలో ఎయిడ్స్ విద్య యొక ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తించబడినదన్నారు. హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు ఇండ్లను వదిలి వెళ్లవలసి వస్తుందని, సానుకూల వ్యక్తులపై వివక్ష చూపడం వల్ల ఎయిడ్స్ మహమ్మారి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. హెచ్ఐవీ కోసం పరీక్షించబడతారేమోనని భయపడితే, ఆపై వారు తెలియకుండానే మరొకరికి సంక్రమిచే అవకాశముందని అందువల్ల హెచ్ఐవీ/ఎయిడ్స్ ఉన్న వారు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలన్నారు.
ఎయిడ్స్పై అవగాహన విద్య అనేది హై రిస్ గ్రూప్లకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. గ్రామీణ యువత వీటి పైన అవగాహన, నివారణ, నిర్మూలన విషయాలు తెలుసుకోవాలని, ఈ మహమ్మారిని తరిమి కొట్టడం అందరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి మెదక్ జిల్లా అధికారి రంజిత్రెడ్డి, కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ అధికారి డాక్టర్ నవీన్, ఐసీటీసీ కౌన్సిలర్లు గోపి, రాజేశ్వర్, డిగ్రీ కళాశాల అంజయ్య, రాజు, యువజన శాఖ కార్యాలయ సిబ్బంది, యూత్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు భూషణ్, యువజన సంఘ ప్రతినిధులు బాయికాడి లక్ష్మణ్, వలంటరీలు రవి, అజయ్, సాయి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.