నర్సాపూర్/ చిలిపిచెడ్, జనవరి 10 : నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్లో నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ వాస్తు కారణంగా నిర్మాణ పనుల్లో కొద్దిగా జాప్యం ఏర్పడిందని, త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో మున్సిపల్ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. భవన నిర్మాణం పూర్తయితే ప్రజలతోపాటు సిబ్బందికి ఇబ్బందులు తీరుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, బీఆర్ఎస్ నాయకుడు అశోక్గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, కమిషనర్ వెంకట్గోపాల్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, కాంట్రాక్టర్ సుదర్శన్, ఏఎంసీ డైరెక్టర్ సాగర్, నాయకులు నగేశ్, ఆంజనేయులుగౌడ్, జగదీశ్ పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా..
నర్సాపూర్లో నిర్మిస్తున్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. ముత్యాలమ్మ ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి సన్మానం
బీఆర్ఎస్ చిలిపిచెడ్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి 55వ పుట్టినరోజు వేడుకలను మండలకేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, అశోక్రెడ్డిని స్థానిక నాయకులతో కలిసి సన్మానించారు.
పీర్లగుట్టపై ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే, చైర్పర్సన్ సునీతారెడ్డి
నర్సాపూర్ మున్సిపల్లోని పీర్లగుట్టపై హజ్రత్ సయ్యద్ అహ్మద్షా, హుస్సేనీ షాహిద్ ఉర్సులో రెండో రోజు కవ్వాలి నిర్వహించారు. ఉర్సుకు ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరి వెంట నిర్వాహకుడు యూనూస్ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, మాజీ ఎంపీపీ లలిత, బీఆర్ఎస్ నాయకులు శశిధర్రెడ్డి, సుధీర్రెడ్డి, సుధాకర్రెడ్డి, జగదీశ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.