సిద్దిపేట అర్బన్, జూలై 19 : వసతులు సమకూర్చడం కంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో ఈ అభ్యాస అకాడమీ ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాల దత్తత కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. అనంతరం ఈ అభ్యాస అకాడమీ ప్రతినిధులు ఫణి, శశి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐఐటీ మెటీరియల్ను మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు విద్యార్థులు ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లిష్ భాషలు మాట్లాడి మంత్రి హరీశ్రావును మెప్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ విద్యార్థుల ఇఫ్లూ ఫలితాలు బాగన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పదో తరగతి ఫలితాలు రావాలని ఎన్నో సమీక్షలు, టెనీ కాన్ఫరెన్స్లు జరిపి తల్లిదండ్రులను టీవీల్ బంద్ చేయాలని కోరిన మాటలు తిరిగి వినగానే.. నా ప్రయత్నం ఫలించిందని అనిపించిందన్నారు.
పదో తరగతి చదివే 200 మందికి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారికి పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించేలా 150 మంది విద్యార్థులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందిస్తానని తెలిపారు. ఈ మేరకు ఇందిరానగర్ హైస్కూల్లో 150 మంది పదో తరగతి విద్యార్థులకు అవసరమయ్యే ఐప్యాడ్స్ అందివ్వాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో ఐఐటీ మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. అనంతరం 10 జీపీఏ సాధించిన విద్యార్థులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, కౌన్సిలర్ కవిత, ఈ అభ్యాస అకాడమీ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.