మెదక్ మున్సిపాలిటీ, జూలై 20 : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులను ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లో పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఆగస్టు 1నుంచి 10 వరకు థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. మెదక్ జిల్లాలో 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ప్రథమ సంవత్సరంలో 4,383 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 2,245 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశంలో ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.
22, 23 తేదీల్లో ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 20 : నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్యకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవింద్రామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22న నైతికత, మానవ విలువలు, 23న పర్యావరణ విద్యకు సంబంధించి పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లు, అవార్డు లిస్ట్, ప్రశ్నా పత్రాలు ఆయా కళాశాలల లాగిన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
26th to