సంగారెడ్డి, మార్చి 21(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం ఐఐటీహెచ్ 16వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్, ఐఐటీహెచ్ పాలకవర్గ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐఐటీహెచ్ ఉన్నతికి కృషి చేసిన 182 మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అకడమిక్, రీసెర్చ్ ఎక్స్లెన్స్ అవార్డులను ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీహెచ్ 15 ఏండ్లుగా ఉన్నత సాంకేతిక విద్యాసంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు భరత్భూషణ్ పాణిగ్రాహి, కంచన్, రంజిత్ రామదురై, మధురిక ఖండేల్వాల్, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.