తొగుట, ఫిబ్రవరి 16 : తెలంగాణను సాధించడంతో పాటు దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలిపిన సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ఘనపూర్ లక్ష్మీనర్సింహాస్వామి వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. పెద్దమ్మ ఆలయం ప్రాంగణం, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఈ నెల 23న సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేస్తారని తెలిపార. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన బాధితులకు రుణపడి ఉంటామన్నారు. ఇటీవల చందాపూర్లో మరణించిన బొడ్డు నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ఎంపీ వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనీతాలక్ష్మారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కనకయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు ఉన్నారు.