ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, ఫిబ్రవరి 15 : అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు కండ్లమంటగా ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించిన విధంగా ఫలితాలు రావడం లేదన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అభివృద్ధి చెందాలని, మహిళలకు మరింత రక్షణ ఉండాలని, ఆస్తిలో హక్కు తదితర అంశాలపై రాజ్యాంగాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్ నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి శ్రీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్లు పుర్మ వెంకట్రెడ్డి, నిమ్మ రాజీవ్రెడ్డి, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తాడెం రంజితాకృష్ణమూర్తి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీశ్, మంగోల చంటి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జిల్లా రాజేశం, టీఆర్ఎస్ మహిళ పట్టణ, మండలాధ్యక్షుడు పచ్చిమడ్ల మానస, మీస పార్వతి, నాయకులు పాల్గొన్నారు.