కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనం రద్దీని తగ్గించడంలో భాగంగా ఆర్టీఏ కార్యాలయాల్లో స్లాట్స్ బుకింగ్స్ను కుదించారు. గతంలో 40 శాతం వరకు స్లాట్స్ కుదించగా.. ప్రస్తుతం 50 శాతం వరకు కు దించారు. జనం రద్దీ ఎక్కువగా ఉంటే కొవిడ్ వ్యాప్తికి కారణమవుతుందనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్, మాస్కులు ధరించడం.. తదితర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించని వారికి సేవలు నిలిపివేస్తున్నారు.