నాగర్కర్నూల్, మే 9 : జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యా హ్నం 12 గంటల 12 నిమిషాలకు జీరో షాడో డే (నీడ లేని రోజు) ఆవిష్కృతమైంది. వస్తువుపై సూర్యకిరణాలు పడితే ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడటం సాధారణం. ఈ ఏడాదిలో నీడ లేని రోజు మే 9వ మంగళవారం కనిపించినట్లు కలెక్టరేట్ అధికారులు గుర్తించారు. సూర్యుడు తలపైకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12:12గంటలకు కలెక్టరేట్ భవనంపై ఎండలో ఒక బాటిల్ను ఉంచగా దానిపై నీడ పడలేదు. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుందని అధికారులు తెలిపారు. భూమి, సూర్యుడి మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారని, ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుందని గుర్తించారు. పట్టణంలో అక్షాంశం 17.3850(ఎన్) డిగ్రీల ప్రకారం కలెక్టరేట్ భవనంపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ వ్యక్తిగత కార్యదర్శి ఖాజా, కార్యాలయ సిబ్బంది పాష, పాదం వెంకటేశ్లు కలిసి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. నిర్దిష్ట సమయంలో ప్లాస్టిక్ బాటిల్పై, అలాగే భవనంపై ఉన్న దిమ్మెల కూడా నీడ పడలేదు. అదేవిధంగా ఆగస్టు 3న మరోమారు ఈ ఘటన చోటుచేసుకోనున్నదన్నారు.