ఫుడ్పార్క్ ఏర్పాటుతో మారనున్న హన్వాడ రూపురేఖలు
అభివృద్ధికి సమిష్టిగా కలిసిరావాలి
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
టీఆర్ఎస్లోకి 60 మంది నాయకులు
మహబూబ్నగర్, జూన్ 14 : రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన మైనార్టీ యువ నాయకులు దాదాపు 60 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ పార్కుతో హన్వాడ మండలం రూపురేఖలే మారనున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కొండాలక్ష్మయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జంబులయ్య ఉన్నారు.
శాంతికుమారికి అభినందన
మహబూబ్నగర్, జూన్ 14: ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్, థాయిలాండ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6నుంచి 13వరకు థాయిలాండ్లో 14వ మహిళల అండర్-18 వాలీబాల్ చాంపియన్షిప్ జరిగింది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కె.శాంతికుమారి భారత జట్టుకు ఎంపిక కావడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ నుంచి ఏషియన్ చాంపియన్ షిప్లో పాల్గొన్న మొదటి మహిళగా నిలిచారని పేర్కొన్నారు. శాంతికుమారిని ప్రోత్సహించిన కోచ్ అరుణారెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తికి మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సాట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.