పాలమూరు, ఫిబ్రవరి 5: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వీరన్నపేట చౌడేశ్వరిదేవి ఆలయంలో అఖండజ్యోతి ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూ జలు చేసి జల్దిబిందె ఎత్తుకొని ఊరేగింపులో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ భిన్నత్వంలో ఏకత్వానికి మహబూబ్నగర్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్యంకొండను అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. తొగట వీరక్షత్రియ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇప్పటికే రూ.10లక్షల నిధులు విడుదల చేశామన్నారు. పాలమూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఏనుగొండ, హౌసింగ్బోర్డులోని పోచమ్మ ఆలయ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజు, తొగట వీరక్షత్రియ సేవా సంఘం సభ్యులు కురుమూర్తి, ఆంజనేయులు, చంద్రమౌలి, లక్ష్మీనారాయణ, స్వామి, శ్రీనివాసులు, భాస్కర్, నర్సింహులు పాల్గొన్నారు.