హన్వాడ, మార్చి 26 : మండలంలోని మాదా రం సమీపంలోని కొండపై ఉన్న తిరుమలనాథస్వామి కోనేరులో ఓ మహిళ పడి మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున వెలుగులోకి వ చ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన బాలమణి (45) సో మవారం రాత్రి నిర్వహించిన తిరుమలనాథస్వామి రథోత్సవాన్ని చూసేందుకు వచ్చింది. తెల్లవారుజామున కోనేరులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కోనేరులో జారిపడింది. ఇది గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని బాలమణిని బయటకు తీయగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. భర్త కృ ష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు ఏఎస్సై వెంకటేశ్ తెలిపారు.