పాలమూరు, నవంబర్ 24 : అయ్యప్పస్వామి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని లారీ అసోసియేషన్ కా ర్యాలయం సమీపంలో గురువారం అయ్యప్ప పడిపూజా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మన్యంకొండలో 800 ఏండ్లనాటి పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తుల దర్శనార్థం సిద్ధం చేసినట్లు చెప్పారు. దూప దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం ప్రతినెలా పూజారులకు వేతనాలు అందిస్తున్నదని తెలిపారు. కాగా మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొరవతో తన ఆరోగ్యం బాగైందని అయ్యప్ప భక్తుడు శ్రీనివాస్ తెలిపారు.
మహబూబ్నగర్ ప్రజలను సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటానని, ఎవరికి ఆరోగ్య సమస్య తలెత్తినా అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. అనంతరం వీరన్నపేట వీరభద్రకాలనీ పవనపుత్ర ఆంజనేయస్వామి ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కుమ్మరివాడ వీరాంజనేయస్వామి ఆలయం లో పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గిరిధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.