కోయిలకొండ, నవంబర్ 2 : గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చామని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పారుపల్లి, వీరంపల్లి, మోదీపూర్, ఇబ్రహీంనగర్, ఖాజీపూర్, నల్లవెల్లి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో తండాలను, మారుమూల గ్రామాలను పంచాయతీలుగా చేసి అన్నివిధాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. కోయిలకొండ అభివృద్ధే లక్ష్యం గా రూ.498కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే 3గంటల కరెంట్ ఇచ్చి అన్ని పథకాలను బంద్ చేస్తారన్నారు. మండలంలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి గుట్టపైకి రోడ్డు కల సాకారం చేస్తానని ఆచార్యపూర్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. శ్రీరామకొండ మాదిరిగా వీరన్నగుట్ట పైకి రోడ్డు వేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. వీరభద్రస్వామి ఆలయం వరకు మిషన్ భగీరథ పైపులైన్ వేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో శ్రీరామకొండ, వీరభద్రస్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సమన్వయకర్త రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సర్పంచులు ఆంజనేయులు, రాము, కల్పన, రాములు, నాయకులు రవి, బుచ్చిరెడ్డి, మైబన్న, రాములు, సత్యయ్య, ఆశన్నగౌడ్, శివగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మండిపడ్డారు. గురువారం శేరివెంకటాపూర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా ఎదగకుండా రూ.కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించా రు. సీఎం కేసీఆర్ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ను నమ్మితే అభివృద్ధి మళ్లీ వెనక్కి వెళ్లిపోతుందన్నారు. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కోయిలకొండ మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్ గురువారం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎర్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.