వనపర్తి టౌన్, అక్టోబర్ 22: చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పండుగను నిర్వహించుకుంటామని ఎస్పీ రక్షితామూర్తి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ సాయుధ దళ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆదివారం ఆయుధ పూజ నిర్వహించా రు. దసరా పండుగను పురస్కరించుకొని ఆయుధాలు, వాహానాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీసులకు దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఆయుధ పూజ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలందించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు పోలీసులపై ఉండాలని ఎస్పీ కోరారు. అదేవిధంగా జిల్లా పోలీస్ సిబ్బందికి, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కోటలో సంస్థానాధీశుల పూజలు..
జిల్లా కేంద్రంలోని సంస్థానాదీశుల కోటలో రాజారామేశ్వరరావు వం శీకులు ఆయుధ పూజ నిర్వహించారు. ఆనాటి యుద్ధంలో వినియోగించిన కత్తులు, ఇతర యుద్ధ సామగ్రికి రాజారామేశ్వరరావు వంశీకులు పూజలు నిర్వహించారు.
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎస్పీ దంపతులు
దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అయ్య ప్పస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వేడుకల్లో ఎస్పీ రక్షితామూర్తి దంపతులు పా ల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్పీ దంపతులకు శాలువాతో ఆల య నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సాయుధ దళాధిపతులు శ్రీనివాస్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్, కొత్తకోట సీఐ శ్రీనివాస్రెడ్డి, ఆర్ఎస్సైలు, అయ్య ప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నాగేశ్ ఇతర సభ్యులు ఉన్నారు.