పాన్గల్: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జడ్పీ చైర్మన్ రాకాసి లోక్నాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బండపల్లి, కొత్తపేట, మాందాపూర్, రేమద్దుల గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఏసీడీఎఫ్ నిధులతో బండపల్లిలో రూ.5 లక్షలు సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో పాఠ శాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే విధంగా కొత్తపేటలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి వారు భూమిపూజ చేశారు. మాందాపూర్ ఉన్నత పాఠశాల కంపౌండ్ నిర్మాణాని కి భూమి పూజచేసి అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా సైన్స్ల్యాబ్ను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కరోనా వల్ల రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఏర్పడినా అభివృద్ధి, సంక్షేమానికి నిధులు కేటాయించి, అమలు చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. వ్యవసాయ రంగానికి మంచి రోజులు త్వరలో రానున్నాయని తెలిపారు. సోమశిల సిద్దేశ్వర్ వంతెన నిర్మాణం, సింగోటం నుంచి గోపల్దిన్నె వరకు రిజర్వాయర్ నిర్మాణం, సింగోటం లక్ష్మి నరసింహా స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధుల కేటాయింపు తదితర వాటి వల్ల రానున్న కాలంలో కొల్లాపూర్ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు.
త్వరలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, సొంత జాగాలో డబుల్బెడ్ ఇండ్లు మంజూరు కానున్నా యని తెలిపారు. వ్యవ సాయ ఆధారిత రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని తెలిపారు. రైతులు ఎప్పటికప్పుడు నూతన వ్యవసాయ పద్దతులు అనుసరించి అధిక లాభాలు పొందాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు సృజనాత్మకత, ప్రశ్నించే తత్వం, హేతువాదం వంటి శాస్త్రీయ వైఖరులను అలవర్చుకోవా లని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ భాగ్యలక్ష్మి, సింగిల్విండో చైర్మెన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి. జడ్పీ కోఆప్షన్మెంబర్ మునిరోద్దిన్, రైతుబంధు మండలాధ్యక్షుడు వెంకటయ్యనాయుడు, వైస్ ఎంపీపీ కవిత, విండో వైస్చైర్మన్ బాలయ్య, మాజీ జడ్పీటీసీ రాం మ్మూర్తి నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘుపతి నాయుడు, జిల్లా విద్యాధికారి రవీందర్, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, తాసీల్దార్ చక్రపాణి, మండల విద్యాధికారి లక్ష్మణ్నాయక్, సర్పంచ్లు రాజేశ్వరమ్మ, జయరాములుసాగర్, మంజుల ఉపసర్పంచ్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ పోతుల భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాముయాదవ్, చంద్రశేఖర్ నాయక్, అడ్వకేట్ రవికుమార్, దిండి రామస్వామి, దశరథ్నాయుడు, వీరసాగర్, సోమనాథ్నాయక్, పుచ్చల మధుకుమార్రెడ్డి, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.