వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలను బుధవారం న్యాక్ బృందం సందర్శించింది. హిమాచల్ప్రదేశ్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రాజేందర్సింగ్ చౌహాన్, బీహార్లోని వినోభాబావే యూనివర్సిటీ ప్రొఫెసర్ మంటున్, శ్రీనగర్ యూనివర్సిటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ముక్తాక్ అలీమీర్ బృందంలో ఉన్నారు.
వీరు కళాశాల నివేదిక, అన్ని విభాగాల రికార్డులు, ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం పూర్వవిద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. తొలి రోజు కళాశాల నాణ్యతా ప్రమాణాల మదింపుపై ప్రధానంగా దృష్టి సారించారు.
ప్రతి ఐదేండ్లకోసారి ఈ బృందం సందర్శన ఉంటుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. వారి వెంట వైస్ ప్రిన్సిపాల్ సురేందర్రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.