జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 3 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా పట్ట ణ, గ్రామీణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మండలంలోని చర్లపల్లిలో శుక్రవారం 212 మందికి పరీక్షలు చేయగా 28 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 21 మందికి మెరు గైన అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. గంగాపురంలో 138 మందికి పరీక్షలు నిర్వహించగా, 5 మందికి అద్దాలు పంపి ణీ చేశారు. 8 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు. మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఏర్పా టు చేసిన శిబిరంలో 155 మందికి పరీక్షలు నిర్వహించి 37 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. 20 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 15వ వార్డులో 155 మందికి పరీక్షలు నిర్వహించగా 39 మందికి అద్దాలను పంపిణీ చేశారు. 17 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ శి వకాంత్ తెలిపారు. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు మందులు, అద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 3 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలో 205 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 7 మందికి కండ్లద్దాలు ఇచ్చారు. మరో 7 మందికి ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపారు. చిన్నరేవల్లిలో 159 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 19 మం దికి కండ్లద్దాలు ఇవ్వగా మరో 7 మందికి మెరుగైన అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ చెప్పారు.
నవాబ్పేట, ఫిబ్రవరి 3 : మండలంతోపాటు యన్మన్గండ్ల, హజిలాపూర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన కంటివెలుగు వైద్య శిబిరాల్లో 577మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నవాబ్పేట లో 212మందికి కంటి పరీక్షలు నిర్వహించి 14మందికి కంటి అద్దాలు అందజేశారు. మరో 14 మందికి కంటి అద్దాల కోసం ఆర్డ ర్ చేశారు. హజిలాపూర్లో 115 మందికి కంటి పరీక్ష లు నిర్వహించి 8మందికి కంటి అద్దాలు అందజేశారు. యన్మన్గండ్లలో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 53 మందికి కంటి అద్దాలు అందజేసి 23 మందికి అద్దాల కో సం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయలక్ష్మి, సిబ్బంది బీచుపల్లిగౌడ్, శ్రీనివాస్, శకుంతల, రాఘవేందర్, అవినాష్ పాల్గొన్నారు.
రాజాపూర్, ఫిబ్రవరి 3 : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమం లో భాగంగా శుక్రవారం 168 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. 12 మందికి కం టి అద్దాలు పంపిణీ చేయడంతోపాటు 9మందికి మెరుగైన అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో కంటివెలుగు కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 3 : కంటివెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మనుప్రియ అన్నారు. శుక్రవారం మండలంతోపాటు కొత్తపల్లిలో కంటివెలుగు కా ర్యక్రమం నిర్వహించారు. 274 మందికి కంటి పరీక్షలు ని ర్వహించగా 20మందికి కంటి అద్దాలు అందజేశారు. మరో 20 మందికి అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. కార్యక్రమంలో వై ద్యాధికారులు కృష్ణకుమార్, వైద్య సిబ్బంది దేవయ్య, జం గయ్య తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, ఫిబ్రవరి 3 : మండలంలో కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతున్నదని కర్ని ఇన్చార్జి డాక్టర్ తిరుపతయ్య అన్నారు. మున్సిపాలిటీలోని తొమ్మిదోవ వార్డులో ఆంజనేయస్వామి ఆలయ కల్యాణ మండపం, మంథన్గో డ్, జౌళపురంలో శుక్రవారం కంటివెలుగు శిబిరం ఏర్పాటు చేశారు. 9వ వార్డులో కౌన్సిలర్ రాధికతో కలిసి కంటివెలు గు కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది ప్రారంభించారు. కల్యాణ మండపంలో 155 మందికి, మంథన్గోడ్లో 111 మంది కి, జౌళపురంలో 104 మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు, నర్సులు పాల్గొన్నారు.