పాలమూరు/దేవరకద్ర/రూరల్/జడ్చర్ల/మిడ్జిల్/బాలానగర్/మహ్మదాబాద్/నవాబ్పేట/మూసాపేట, జూన్ 29 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు బా రులు దీరారు. అదేవిధంగా భక్తిశ్రద్ధ్దలతో స్వామివారికి టెంకాయలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే చిన్నచింతకుంట మండ లం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా జిల్లాకేంద్రంతోపాటు జిల్లాలోని వేంకటేశ్వరస్వా మి, లక్ష్మీనర్సింహస్వామి, లక్ష్మీచెన్నకేశవస్వామి తదితర ఆలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చి, ఉపవాసదీక్షలు చేశారు.
జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారికి లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయా నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.