మక్తల్ టౌన్ ఫిబ్రవరి 8: శివనామ స్మరణతో మక్తల్ పట్టణం మార్మోగింది. 23వ మహా శివపూజ కార్యక్రమం గురువారం ఉదయం గంగాపూజతో ప్రారంభమైంది. ఉద యం 7:40 గంటలకు పడమటి ఆంజనేయస్వామి ఆల యం నుంచి మల్లికార్జున ఆలయం వరకు కలశపూజ కను ల పండువగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కలశ స్థాపన, శివధ్వజ స్థాపన, అష్టదిగ్బంధనం, గోపూజ, జ్యోతిర్లింగాల మహాపూజ, బిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. శివస్వాములు మల్లికార్జునస్వామి ఆలయంలో ఆటపాటలతో మహాపూజను కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో తిప్పయ్యస్వామి, వేంకటేశ్వర్రెడ్డి గురుస్వామితోపాటు శివస్వాములు పాల్గొన్నారు.
నారాయణపేట, ఫిబ్రవరి 8: పట్టణంలోని సింగార్భేస్లోవెలిసిన లింగయ్యగుడిలో బుధవారం శివమహాపూజ ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళీ వీధిలోని శివాలయం నుంచి మహిళల మంగళహారతులు, జంగమదేవరుల ఖడ్గ విన్యాసాల మధ్య కలశాన్ని ఊరేగించారు. అనంతరం లింగయ్యస్వామి ఆలయంలో 12 మెట్ల పై శివలింగాలను ఉంచి కర్పూరం వెలిగించి, శివస్వాము లు, భక్తులు శివనామస్మరణ చేయగా మహాపూజను కనుల పండువగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 8: పేట మండలంలోని జాజాపూర్ గ్రామంలో బుధవారం శివమహా పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగాన్ని ట్రాక్టర్పై ఉంచి శివస్వాములు కలశం, పల్లకీని భజన మేళతాళాలతో ఊరేగించారు. రాజు గురుస్వామి ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు
మరికల్, (ధన్వాడ) ఫిబ్రవరి 8: ధన్వాడ మండలంలోని మందిపల్లి పాత తండాలో శివాలయ నిర్మాణం కోసం బుధవారం సర్పంచ్ మాధవి రూ.25 వేల విరాళం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండాలో శివాలయ నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో శివస్వాములు తదితరులు పాల్గొన్నారు.