మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం పెద్దమునుగల్ చెడ్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అడ్డాకుల మండల తహసీల్దార్ బి.కిషన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు తక్షణం స్పందించి విద్యార్థులను వారి సొంత వాహనాల్లో దవాఖానకు తరలించి వైద్య సేవలు అందేలా చేశారు.
తమ పిల్లలకు వెంటనే వైద్యం అందేలా చూసినందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని అభినందించారు. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి శాలువాతో సత్కరించారు. ఇదే స్ఫూర్తిని ఇతర అన్ని స్థాయిల అధికారులందరూ అలవరచుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.