పాలమూరు, జనవరి 4 : ప్రతిఒక్కరూ సేవాభావం అలవర్చుకొని పేదలను ఆదుకోవాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రూ.13లక్షలతో నిర్మించిన భారత్ స్కౌ ట్స్ అండ్ గౌట్స్ కార్యాలయ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలబాలికల్లో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించి సమాజ సేవకులుగా తీర్చిదిద్దడంలో భారత స్కౌట్స్ అండ్ గౌట్స్ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. సదా సమాజ సేవలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సమాజ శ్రేయస్సుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సత్యం పలకడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవ చేయడం, పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సహాయపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న స్కౌట్స్ అండ్ గౌట్స్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంక న్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, స్కౌట్స్ అండ్ గౌ ట్స్ సభ్యులు ధనుంజయ్, రాజగోపాల్, మల్లారెడ్డి, వెంకట య్య, చంద్రకళ, స్వరూప, విజయలక్ష్మి పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మహబూబ్నగర్ మండలం చౌదర్పల్లికి చెందిన సుమలతకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల 50వేల చెక్కును జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. అనారోగ్యంతో నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల 50వేలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మానర్సింహులు, ఉపసర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మంత్రి
జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్ నివాసగృహంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గురుస్వామి అన్వే ష్, అయ్యప్పస్వాములు, నాయకులు పాల్గొన్నారు.