మాగనూరు, మార్చి 21 : బియ్యం లారీ పట్టుబడిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్ గ్రామంలోని ఓ రైస్ ఇండస్ట్రీ నుంచి కర్ణాటకలోని రాయిచూర్కు 150 క్వింటాళ్ల బియ్యంతో లారీ వెళ్తున్నదన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అప్రమత్తమైన వారు మాగనూరు పోలీస్స్టేషన్ ఎదురుగా బుధవారం రాత్రి వాహనాన్ని పట్టుకొని స్టేషన్కు తరలించారు. బియ్యంపై అనుమానం ఉండడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గురువారం డీటీ కాలప్ప పరిశీలించారు. బియ్యం శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు తరలించారు. రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని డీటీ తెలిపారు.