మూసాపేట(అడ్డాకుల), మార్చి 21 : పిల్లా, పాపలను, గొడ్డు, గోదను చల్లంగా చూడమ్మా.. జములమ్మ తల్లీ అంటూ అడ్డాకుల మండలంలోని కం దూరు గ్రామస్తులు వేడుకున్నారు. కందూరు గ్రా మంలో నాలుగు రోజులుగా జములమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు. అం దులో భాగంగా గురువారం జములమ్మకు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఇష్టమైన నైవేద్యాలను నూతన పాత్రలలో వండి బొట్లతో అలంకరించారు. అనంతరం భాజాభజంత్రీలు, డోలు, డప్పుల మోతల మధ్య బోనాలతో మహిళలు భారీ ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జములమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ ఉత్సవాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.