కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 2 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త పింఛన్ రూ.4వేలు వస్తాయని ఆశించిన అవ్వకు కొత్త ప్రభుత్వం ఉన్న ఆసరాకు ఎసరు పెట్టింది. కొల్లాపూర్ మండలం ఎన్మన్బెట్ల గ్రామానికి చెందిన మంచాల కురుమయ్య భార్య మం చా ల చెన్నమ్మ ఆసరా పింఛన్కు అర్హత ఉన్నా అరువు తెచ్చుకొని బతుకుతున్నది. కుటుంబానికి ఆసరా ఉన్న మంచాల కురుమయ్య చనిపోవడంతో మంచాల చెన్నమ్మ ఒంటరి పక్షి అయ్యింది.
భర్త కు వస్తున్న పింఛన్ మాయమైంది. తనకు రావాల్సిన పింఛన్ దారిలో సాకులు వెతుకుతోంది. దీంతో అనారోగ్యం బారి న పడిన మంచాల చెన్నమ్మ ఎన్మన్బెట్ల నుంచి రోజూ కొల్లాపూర్లోని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి పడిగాపులు కాస్తోంది. కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛన్ ఇస్తామన్నారు.. నాకు కొత్త పింఛన్ ఎప్పుడిస్తారు చెప్పండని అధికారులు, కార్యాలయానికి వచ్చే వారితో మొరపెట్టుకుంటున్నది. కాగా శుక్రవారం కూడా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన చెన్నమ్మ కార్యాలయ ఆవరణలోనే పడిగాపులు కాసి సొమ్మసిల్లి పడిపోయింది.