కోయిలకొండ జనవరి 5 : చిరుత దాడి లో ఆవుదూడ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్నది. అటవీ అధికారుల వివరాల ప్రకారం.. మండలంలో ని చందాపూర్కు చెందిన రైతు మొగులయ్య గురువారం రాత్రి పొలంలో పశువులను కట్టేసి ఇంటికి రాగా చిరుత ఆవుదూడపై దాడిచేసి కొంత దూరం తీసుకువెళ్లి చంపింది. గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ అధికారులు ఘటనా స్థలా న్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రైతుకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని బీట్ అధికారులు పేర్కొన్నారు.