వేరుశనగ సాగు రైతులకు సిరులు కురిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 5,609 ఎకరాల్లో పల్లీ పంట సాగైంది. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని వ్యవసాయాధికాలు అవగాహన కల్పించడంతో వానకాలం సీజన్లో కర్షకులు వేరుశనగకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పల్లీరాశులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. క్వింటాకు రూ.9,012 వరకు మద్దతు ధర లభించడంతో అన్నదాత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో యాసంగిలోనూ ఆసక్తి చూపారు. 15 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు.
గద్వాల, డిసెంబర్ 2 : జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగైన వేరుశనగకు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది. దీంతో రైతులకు లాభాల పంట పండనున్నది. యాసంగిలో రైతులు వరికి ప్ర త్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తుండడంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. వానకాలంలో సాగుచేసిన వేరుశనగ ప్రస్తుతం మార్కెట్కు వస్తుండడంతో యాసంగిలో కూడా అదే పంటపై మొగ్గు చూపుతున్నారు. గతంలో ఆన్లైన్ టెండర్ విధానం లేకపోవడంతో కొనుగోలుదారులు కుమ్మక్కై ధర ఇచ్చేవారు కాదు. ప్ర భుత్వం ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేయడంతో రైతులకు కలిసివస్తున్నది. గద్వాల వ్యవసాయ మార్కెట్కు అక్టోబర్ నుంచే వేరుశనగ తరలివస్తున్నది.
క్వింటాకు రూ.5,850 ప్రభుత్వ మద్దతు ధర ఉన్నది. నాణ్యత బాగా ఉంటే అంతకు మిం చి ధరతో కొనుగోళ్లు చేపడుతున్నారు. జిల్లాలో వానకాలం సీజన్ లో 5,609 ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. కాగా, యాసంగిలో 15 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నట్లు అధికారుల అం చనా. మార్కెట్లో వారం రోజులుగా వేరుశనగ రైతులకు మంచి ధర వస్తున్నది. గత నెల 24న గద్వాల మార్కెట్లో ఇటిక్యాల మం డలం బీ.వీరాపురం గ్రామానికి చెందిన రైతు మన్యం నాయుడుకు అత్యధికంగా రూ.9012 ధర వచ్చింది. 25న రూ.8496, 26న రూ.9152, 28న రూ.8812, 30న రూ.8940 ధర పలికింది. దీన్ని బట్టి చూస్తే క్వింటాకు రూ.8,400కు తగ్గడం లేదు. ఈ ఏ డాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,31,235 క్వింటాళ్ల వేరుశనగను వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేశారు.
నాకు ఉన్న ఎకరాలో వేరుశనగ సాగుచేశా. గద్వాల వ్యవసాయ మార్కెట్కు పంట తీసుకెళ్లగా రూ.8,700 ధర వచ్చింది. మంచి ధర రావడంతో ఎం తో సంతోషంగా ఉన్నది. వ్యవసాయ మార్కెట్లో ఆన్లైన్ కొనుగోళ్లు చేయడంతో రైతులకు మద్దతు ధర పొం దే అవకాశం ఏర్పడింది. ఈ సారి కూడా వేరుశనగ పం టనే సాగు చేస్తాను.
– ప్రేమయ్య, నాగర్దొడ్డి, మల్దకల్
రైతులు ఎప్పుడూ ఒకే పంట సాగు చేయొద్దు. పంట మార్పి డి జరగాలి. వరి తదితర పంటలు సాగుచేసి ఇబ్బంది పడొద్దని అధికారులు సూచించడంతో.. రెండు ఎకరాల్లో వేరుశనగ సాగుచేశాను. పంటను మార్కెట్కు తీసుకొస్తే క్విం టాకు రూ.8,675 ధర వచ్చింది. అధికారుల సూచనలు పాటిస్తే మంచి లాభాలు గడించొచ్చు.
– రామాంజనేయిలు, కొత్తపల్లి, అయిజ