పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మాజీ సైనికుడు మల్లేశ్యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చురుకుగా పనిచేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు డబ్బులతో ప్రలోభపెట్టినా మల్లేశ్యాదవ్ లొంగలేదు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయవద్దు అని, ఒకవేళ చేస్తే చంపేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరించినట్లు మల్లేశ్యాదవ్ కుటుంబసభ్యులతో చెప్పుకున్నాడు. కాంగ్రెస్ నాయకులకు భయపడకుండా ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. దీంతో కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు భూతగాదాలను బూచిగా చూపి 2023 డిసెంబర్ 28న రాత్రి హత్య చేయించారు.