‘వే’ సైడ్ మార్కెట్ ఫ్యూచర్ బెస్ట్గా నిలవనున్నది. రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా వీటి నిర్మాణానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కృషి చేశారు. రాష్ట్రంలోనే తొలి మార్కెట్ను వనపర్తిలోని పెబ్బేరు రోడ్డును అనుసరించి అటవీశాఖ భూమిలో ఏర్పాటు చేశారు. సింజెంటా కంపెనీ సహకారంతో రూ.3.40 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో వినూత్న తరహాలో నిర్మాణం చేపట్టారు. రైతుల కోసం టాయిలెట్లు, ఆటస్థలం, పచ్చని లాన్, పార్కింగ్, క్యాంటీన్ సౌకర్యం కల్పించారు. కూరగాయలు, పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చే కర్షకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా డిజైన్ చేశారు. రైతును ఆకర్షించేలా ఉన్న మార్కెట్లో నేరుగా వారే వచ్చి పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించేలా వసతులు కల్పించారు. ప్లాట్ఫాంలను సైతం తీర్చిదిద్దారు. దీంతో మంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మహబూబ్నగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆ మార్కెట్లో దళారులు అసలే ఉండ రు.. ఎవరికీ కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. షాపులకు కిరాయి కట్టాల్సిన పనిలేదు.. అయి నా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు స్వేచ్ఛగా అమ్ముకునే వెసలుబాటు ఉన్నది. ఇదంతా వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన వే సైడ్ మార్కెట్ గురించే… వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కృషికి విత్తన కంపెనీ సహకారం అందించింది. రూ.3.40కోట్లతో వినూత్న తరహాలో మార్కెట్ను నిర్మించారు.
వనపర్తి శివారులో అటవీ శాఖకు చెందిన భూమిని కేటాయించారు. పెబ్బేరు రహదారికి ఆనుకుని ఉన్న ఈ మార్కెట్తో రైతులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వినియెగదారులు, రైతుల సౌకర్యం కోసం టాయిలెట్లు, ఆటస్థలం, పచ్చని లాన్, పార్కింగ్, క్యాంటీన్ వంటి వసతులు కల్పించారు. రైతులు పండించిన తాజా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న అనుభూతి కలిగేలా దీన్ని డిజైన్ చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ మార్కెట్ను మున్సిపాలిటీకి అప్పగించాలా.. మార్కెటింగ్ శాఖకు ఇవ్వాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మార్కెట్ను నిర్మించినందుకుగానూ రైతులు మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మార్కెట్లో సకల సౌకర్యాలు..
విజిటేబుల్ సీడ్స్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సింజెంటా కంపెనీ నిర్మించిన మార్కెట్ రైతులకు లాభం చేకూరనున్నది. ఆదాయం, సంక్షేమం దృ ష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో తొలి మార్కెట్ను నిర్మించా రు. రాష్ట్రంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద ఐ క్లీన్లో భాగంగా ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కంపెనీ ప్రతినిధులు కలిసి వనపర్తిలో కొత్త విధివిధానంతో మార్కెట్ను నిర్మిస్తామని ప్రతిపాదించారు. మొదట చిన్నగా కట్టాలని అనుకున్నా.. ఆ తర్వాత విభిన్న రీతిలో నిర్మించాలని భా వించారు. దీనికి మంత్రి గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే కాకుండా విశాలమైన స్థలాన్ని మర్రికుంట వద్ద కేటాయించారు. రూ.3.40కోట్లతో నిర్మించిన ఈ మార్కెట్లో సకల సదుపాయాలు ఉన్నాయి. బేబీ ఫీడింగ్ రూం, పార్కు, క్యాంటీన్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించారు.
సరికొత్త ఆలోచనలతో..
దేశంలోనే నూతన ఆలోచనా విధానంతో రూపొందించిన వే సైడ్ మార్కెట్ అందరినీ ఆకర్షిస్తున్నది. చాలా మంది రైతులకు మార్కెటింగ్ ఇబ్బందికరంగా మారింది. అమ్మడానికిపోతే అగ్గువకు అడుగుతున్నారు. కొనడానికి పోతే ఎక్కువ ధర చెబుతున్నారు. దీంతో రైతులు వచ్చిన కాడికి చాలనుకుని తక్కువ ధరకే దళారులకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నారు. రైతులు తాము పండించిన కూరగాయలను స్వేచ్చగా అమ్ముకొనే వెసలుబాటు కల్పించడమే వే సైడ్ మార్కెట్ ఉద్దేశం. వినియెగదారులు కూడా ఈ మార్కెట్కు వచ్చి తక్కువ ధరకే తాజా కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా పూలు, పండ్లు, ఇతరత్రా ఉత్పత్తులను కూడా విక్రయించేలా ప్లాట్ఫాంలు ఏర్పాటు
చేశారు.
రైతుల లాభం కోసమే..
రైతులకు లాభాలు తెచ్చిపెట్టేలా వే సైడ్ మార్కెట్ ని ర్మించాం. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా మార్కెట్ను డిజైన్ చేశాం. ప్రైవేట్ విత్తన కంపెనీ తన సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దేశంలోనే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చింది. సింజెంటా కంపెనీ వే సైడ్ మార్కెట్కు ప్లాన్ చేసి చక్కని వసతులతో నిర్మించింది. సీఎం కేసీఆర్ ప్ర భుత్వ విధానాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి