మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం గురువారం విజయవంతంగా సాగింది. మొత్తం 6,744మందికి కంటి పరీక్షలు నిర్వహించి 918మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 537మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఇప్పటివరకు 79,465మందిని పరీక్షించి 12,240మందికి అద్దాలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కంటివెలుగు శిబిరాలను జిల్లా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ మోతీలాల్ పరిశీలించారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 2 : కంటివెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. జడ్చర్ల మండలంలోని చర్లపల్లిలో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 139 మందిని పరీక్షించి 21మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 41మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. గంగాపురంలో 128మందిని పరీక్షించి ఆరుగురికి అ ద్దాలను అందజేశారు. మరో ఐదుగురికి అద్దా ల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు. మున్సిపాలిటీలోని 4 , 15 వార్డుల్లో 352 మందికి పరీక్షలు నిర్వహించి 95మం దికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 28మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. నాల్గోవార్డులో కంటివెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి పరిశీలించారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 2 : కంటివెలుగు కా ర్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శరత్చంద్ర కోరారు. మండలకేంద్రంతోపాటు చౌదర్పల్లిలో 210 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలను అందజేసినట్లు తెలిపారు.
మహ్మదాబాద్, ఫిబ్రవరి 2 : మండలంలోని సంగాయిపల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరంలో 319మంది పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి మహ్మద్ తెలిపారు. దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి అవసరమైన కండ్లద్దాలు, మందులను అందజేసినట్లు పేర్కొన్నారు.
భూత్పూర్, ఫిబ్రవరి 2 : మండలంలోని కొత్తూర్లో కంటివెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ప్రారంభించారు. శిబిరంలో 103మందిని పరీక్షించి 42మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. అలాగే కప్పెటలో 101మందిని పరీక్షించి 28మందికి అద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు.
బాలానగర్, ఫిబ్రవరి 2 : మండలకేంద్రంలో 167మందికి పరీక్షలు నిర్వహించి 18మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినట్లు డాక్టర్ సృజన తెలిపారు. మరో 16మందికి అ ద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చిన్నరేవల్లిలో 115మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 16మందికి అద్దాలను అందజేసినట్లు తెలిపారు. మరో 7మందికి అ ద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు.
మిడ్జిల్, ఫిబ్రవరి 2 : మండలంలో 222 మందిని పరీక్షించి 35మందికి కండ్లద్దాలను అందజేసినట్లు వైద్యాధికారులు మనుప్రియ, కృష్ణకుమార్ తెలిపారు. మరో 28మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు.
రాజాపూర్, ఫిబ్రవరి 2 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని తాసిల్దార్ రాంబాయి పరిశీలించారు. మొత్తం 120మందికి పరీక్షలు నిర్వహించి 28మందికి కండ్లద్దాలను అందజేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. మరో 13మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 2 : కౌకుంట్ల మండలం రేకులంపల్లిలో 125మందికి పరీక్షలు నిర్వహించి 8మందికి కండ్లద్దాలను పం పిణీ చేశారు. మరో ఇద్దరికి అద్దాల కోసం ఆర్డ ర్ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. చిన్నచింతకుంటలో 195మందిని పరీక్షించి 17మందికి అద్దాలు అందజేశారు. మరో 15మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అప్పంపల్లిలో 150మందికి పరీక్షలు నిర్వహించి 21మందికి అద్దాలు అందజేశారు. మరో 10 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు.