మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 9 : బడుగు బలహీనవర్గాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటినుంచి చిన్నచూ పు చూస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణమండపం వద్ద వాల్మీకి బోయలు చేపట్టిన దీక్షాశిబిరాన్ని శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వాల్మీకి బోయల స్థితిగతులపై చెల్లప్ప కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు.
సామాజికంగా వెనకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించిందన్నారు. అవసరమైతే అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వాల్మీకి బోయల కోసం హైదరాబాద్లో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంతోపాటు నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక 1000 గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు.
రామాయణాన్ని రచించి రామరాజ్యాన్ని ప్రపంచానికి చాటిన వాల్మీకి మహర్షి జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కోరా రు. ఓబీసీలకు కనీసం ఒక మంత్రిత్వశాఖ ను కూడా ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అణగారినవర్గాలపై వివక్ష చూపుతున్నదని విమర్శించారు. వాల్మీకి బోయల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో మరోసారి వ్యక్తిగతంగా చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, వాల్మీకి సం ఘం నాయకులు పాల్గొన్నారు.