నెట్వర్క్, (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 6 ;ప్రజాహితం కోసం సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి పథంలో పయణింపజేసి దేశానికే దిశానిర్దేశంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తుండగా.. మానవతా దృక్పథంతో మరో అడుగు ముందుకేశారు. ఎంతో మంది పేదలు కష్టాన్ని నమ్ముకొని పొద్దుగాలనే పొలం పనులకు వెళ్తుండగా, వారి పిల్లలకు సరైన ఆహారం లేక ఉదయం వేళలో ఖాళీ కడుపుతో పాఠశాలకు వెళ్తున్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులు అర్థాకలితో అలమటించరాదనే ఉద్దేశంతో ‘సీఎం అల్పాహారం పథకం’ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పేదపిల్లల ఆకలి తీర్చేందుకే అల్పాహారం ; క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
కాయకష్టం చేసుకొని బతికే పేదపిల్లల ఆకలి తీర్చేందుకే సీఎం కేసీఆర్ అల్పాహార పథకాన్ని తీసుకొచ్చారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా మానవతా దృక్పథంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో సీఎం అల్ఫాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల పిల్లలకు ఇంట్లో ఉదయమే అల్పాహారం చేయడం కష్టమని గుర్తించి సీఎం కేసీఆర్ కాలే కడుపు నింపేందుకు ఎవరి ఊహకందని పథకాన్ని ప్రవేశపెట్టడంపై కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో 83,522 మందికి అల్పాహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇంత గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ముడు నెలల కిందటే అక్షయపాత్ర ద్వారా అల్పాహార పథకాన్ని ప్రారంభించామన్నారు. మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ న రసింహ, స్థానిక సంస్థల ఇన్చార్జి, డీఆర్డీవో యాద య్య, డీఈవో రవీందర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న పాల్గొన్నారు.
బడుగుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి ; ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అల్పాహార పథకం పేద విద్యార్థులకు వరమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన ప్రారంభించారు. పాఠశాలలో సరస్వతీమాతకు పూజలు చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని భుజించారు. దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టని విధంగా పాఠశాల విద్యార్థుల కు అల్పాహార పథకాన్ని తెలంగాణలో నిర్వహించడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థులు అర్థాకలితో చాలా మంది పొద్దగాల పా ఠశాలకు వస్తారని, వారికి ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహ్మగౌడ్, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ అరుణ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ; జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే విద్యార్థులకు టిఫిన్ అందించి వారి ఆకలి తీర్చేందుకు ఎంతో మంచి పథకం ప్రవేశపెట్టారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అల్పాహారం పథకాన్ని శు క్రవారం జడ్చర్ల మండలం కోడ్లల్ జెడ్పీ హైస్కూల్ లో కలెక్టర్ రవినాయక్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి స్వయంగా విద్యార్థులకు ఇడ్లీ తినిపించారు. అనంతరం అల్పాహార మెనూ పోస్టర్లను ఆవిష్కరించారు. పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. మహిళలకు బతుకమ్మ చీరలను పం పీణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మో హన్రావు, జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీడీవో ఉమాదేవి, ఎంఈవో మంజులాదేవి పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు ప్రభుత్వం అండ ; అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, సీఎం కేసీఆర్ పేద విద్యార్థుల కోసం అల్పాహారం అందించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం పేర్కొన్నారు. మండలంలోని ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మధునాయడు, ఎంపీడీవో రాఘవ, పీఏసీసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, విద్యాధికారి రాజు, జీహెచ్ఎంలు సువార్తమ్మ, విష్ణు పాల్గొన్నారు.
సర్కారు బడుల బలోపేతానికి కృషి ; కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్
పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అల్పాహారం పథకాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రారంభించారు. అనంతరం చౌదర్పల్లిలో రూ.25లక్షలతో నిర్మించే 60వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంకు నిర్మాణానికి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, సీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, చౌదర్పల్లి సర్పంచ్ గాలమ్మ, వార్డు సభ్యులు శ్రీశైలం, బాల్రాం, తిరుపతయ్య, శ్రీశైలం, కొండల్, మా దవరెడ్డి, రమేశ్, పర్వతాలు, రంగారెడ్డి, గ్రామ రైతు కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదలపాలిట వరం ; దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ సీఎం అల్పాహార పథకాన్ని అమలు చేయడం వరమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అల్పాహార పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే విద్యార్థులతో అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదల పిల్లలు ఆకలితో అలమటించరాదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ మధ్యాహ్న నాణ్యమైన భోజనంతోపాటు అల్పాహారం అందించడం అభినందనీయమన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కేవలం ఒకటి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే అల్పాహారం అందిస్తున్నారని, సీఎం కేసీఆర్ ఒకటి నుంచి పదో తరగతి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు రూ.15వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రవీందర్, మండల ప్రత్యేకాధికారి రవీందర్, తాసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏఎంవో శ్రీనివాసులు, మండల విద్యాధికారి జయశ్రీ, ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ సుజాత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి తదితరులు పొల్గొన్నారు.
మెనూ ప్రకారం అందించాలి ; నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం అల్పాహార పథకం మెనూ ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్తో కలిసి అల్పాహార పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ విద్యార్థులకు నచ్చిన అల్పాహారం పెట్టాలన్నారు. ఉదయమే ఇంట్లో పిల్లలు అల్పాహారం తీసుకోవడం సాధ్యం కాదని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారం వడ్డించి నాణ్యత, రుచిపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, జెడ్పీటీసీ అంజలి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం ; కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెలే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండూరు ప్రాథమిక పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు కాలిన కడుపుతో ఉండకూడదనే ఉద్దేశ్యంతో అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు. అల్పాహారం అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ శాతం తగ్గుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అభిలాష్రావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సీనియర్ నాయకుడు రాజేశ్, మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ విజయరామరావు, నాయకులు రామకృష్ణ, రాము, జ్ఞానేశ్వర్, భాస్కర్గౌడ్, రఫీ పాల్గొన్నారు.
పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు కృషి ; మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బడిపిల్లల భవితకు చేయూతనందించి, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకే సీఎం అల్పాహార పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. మక్తల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల వనరుల అధికారి వెంకటయ్య అ ధ్యక్షతన అల్పాహార ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అధితిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే చిట్టెం స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాసులు, జీహెచ్ఎం అనిల్గౌడ్, మున్సిపల్ కమిషనర్ బల్రాంనాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, కౌన్సిలర్లు రాములు, మోగిలప్ప, పట్టణాధ్యక్షుడు అమరేందర్రెడ్డి, ఉపాధ్యాయులు అరుణ, సృజన, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రాములు, తిరుమల్రావ్, బీఆర్ఎస్ నాయకుడు ఈశ్వర్యాదవ్ పాల్గొన్నారు.