అచ్చంపేట, ఆగస్టు 24 : బంజారుల కట్టుబొట్టు సంస్కృతీ సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తున్నది. గిరిజనుల ఆచారాలు, పండుగలు, సాం ప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. గిరిజనులు (బంజారులు) నిర్వహించుకునే ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. నల్లమల ప్రాంతంలో ప్రతి ఏడాది శ్రా వణమాసంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. గిరిజన సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునే పండుగల్లో తీజ్కు ప్రత్యేక స్థానం ఉంది. బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సందడి తండాలు, గ్రామాల్లో ఇప్పటికే ప్రారంభమైంది.
తీజ్ వేడుక బతుకమ్మ పండుగనును పోలి ఉంటుంది. పెండ్ల్లికాని యువతులు తొమ్మిదిరోజులపాటు భక్తిశ్రద్ధలతో మట్టిని, మొలకలను ఆరాధిస్తారు. బంజారా మహిళలు, యువతుల ఆటపాటలు, నృత్యా లు, డప్పుల మధ్య భక్తిభావంతో తొమ్మిదిరోజులపా టు ఉపవాసాలు ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అక్కారం, పూర్యతండా, గుంపన్పల్లి, ఐనోలు,సీబీ తండాల్లో పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అమ్రాబాద్, పదర మండలాలతోపాటు జిల్లాలోని ఆయా తండాల్లో తీజ్ వేడుకలు కొనసాగుతున్నాయి. వర్షా లు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, తం డాలు, గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవద్దని కోరుతూ పూజిస్తారు.
తండాల్లో పండుగ సందడి
పండుగ ప్రారంభానికి ముందు యువతులందరూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇంటింటికీ తిరి గి విరాళాలు సేకరిస్తారు. అంగడికి వెళ్లి గోధుమలు, శ నగలు తెచ్చుకుంటారు. గోధుమలను నానబెట్టి మొలకెత్తించేందుకు బుట్టలను అల్లుతారు. ఒక్కో యువతి ఒక్కో బుట్టను తయారు చేస్తారు. ఆ బుట్టలన్నీ ఒకే చోట ఉంచేందుకు పందిరిని ఏర్పాటు చేస్తారు. పుట్టమట్టిని తెచ్చి అందులో పశువుల ఎరువును కలుపుతారు. బంజారుల ఆరాధ్యదైవమైన మేరామ అమ్మవారు, సేవాలాల్ మహారాజ్, సీత్లాభవాని పేర్లతో తయారు చేసిన బుట్టలలో మొదటగా తండాపెద్దల చే త ఎరువు కలిపిన మట్టిని బుట్టల్లో పోయిస్తారు. నానబెట్టిన గోధుమలను మట్టికలిపిన బుట్లలో చల్లుతారు. గోధుమ మొలకలను తీజ్గా పిలుస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బుట్టల్లో నీళ్లుపోస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలతో గడుపుతారు. ఉప్పు,కారం లేని భోజనం చేస్తూ, మాంసాహారానికి దూరంగా ఉంటూ తండానుంచి బయటకు వెళ్లకుండా నియమాలు పాటిస్తారు.
తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
తొమ్మిదిరోజులపాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. నానబెట్టిన శనగలను రేగిముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడిఝుష్కేరో పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టలో చల్లడం సాయంత్రం నిర్వహిస్తారు. పెండ్లికాని ఆడపిల్లలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే వారికి బావ వరుస అయినవారు ముళ్లను కదిలిస్తారు. అయినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది. తీజ్ ఎంత ఏపుగా, పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవితభాగస్వామి వస్తారని విశ్వసిస్తారు. ఏడో రోజు రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను మేరామ అమ్మవారికి సమర్పిస్తారు. ఎనిమిదో రోజు బంజారుల ఆరాధ్యదేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు.
చివరిరోజు నిమజ్జనం కనుల పండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు. మొలకల బుట్టలను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువతులు తీజ్ను తలపై పెట్టుకుంటారు. తీజ్ను పెద్దల తలపాగాలో ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తీజ్బుట్టలను తలపై ఉంచుకొని డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఆటాపాటలతో బయలుదేరి చెరువుల్లో తీజ్ను నిమజ్జనం చేస్తారు.