మరికల్, జనవరి 4 : విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభ పద్ధతిలో విద్యాబోధన అందించడం కోసం తొలిమెట్టు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని జెడ్పీ వై స్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అ ధికారి గోవిందరాజులు అన్నారు. ధన్వాడ మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం తొలిమెట్టు మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదవడం, రాయడం రావాల ని, విద్యార్థులకు నూతన ఒరవడితో విద్యాబోధన కోసం మేళాను ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు మేళాకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గోవర్ధన్గౌడ్, మాధవి, జిల్లా కో ఆర్డినేటర్ అంజాద్, కాంప్లెక్స్ స్కూల్ హెచ్ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రాథమిక దశ పునాదివంటిది
దామరగిద్ద, జనవరి 4 : పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది వంటిదని ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు. మండలంలో బుధవారం నిర్వహించిన బోధన అభ్యాసన సామగ్రి ప్రదర్శన కార్యక్రమానికి హాజరై మాటాడారు. ప్రాథమిక దశలో విద్యార్థులు సా ధించాల్సిన సామర్థ్యాలను సాధించినప్పుడే మెరుగైన విద్య సహకారమవుతుందన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొలిమెట్టు ప్రత్యేక కార్యక్రమం తో టీఎల్ఎమ్ మేళా నిర్వహించి అధిగమించాలన్నారు. మంచిగా ప్రదర్శించిన పలువురి ఉపాధ్యాయులను ప్రశంసించారని మండల విద్యాధికారి వెంకటయ్య తెలిపారు. కా ర్యక్రమంలో మండల నోడల్ అధికారి బాలాజీ, ఎంపీపీ నర్సప్ప, పీఏసీసీఎస్ చైర్మన్ పుట్టి ఈదప్ప, వైస్ ఎంపీపీ దా మోదర్రెడ్డి, సర్పంచ్ ఆశమ్మ, ఎంపీవో రామన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న టీఎల్ఎమ్ మేళా
మాగనూర్, జనవరి 4 : మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు మండల కేం ద్రంలోని లక్ష్మీనరసింహాస్వామి ఆల య ఆవరణలో బుధవారం ఎఫ్ఎల్ఎన్ మండల స్థాయి టీఎల్ఎమ్ మే ళా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీటీసీ వెంకటయ్య, ఎం పీపీ శ్యామలమ్మ, ఇన్చార్జి ఎంఈవో లక్ష్మీనారాయణ హాజరై టీఎల్ఎమ్ మేళాను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ వెం కటయ్య, క్లస్టర్ నోడల్ అధికారి న ర్సింహులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మండలస్థాయి…
కృష్ణ, జనవరి 4 : మండలంలో ఏర్పాటు చేసినటువంటి మండలస్థాయి టీఎల్ఎమ్ మేళా మండల కేంద్రంలోని జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించా రు. మేళాకు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఆయా పాఠశాలలు తయారు చేసినటువంటి ప్రదర్శనలు జిల్లాస్థాయి టీఎల్ఎమ్ మేళాకు ఎంపికయ్యాయి. అనంతరం ఉపాధ్యాయులకు అధికారు లు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈవో లక్ష్మీనారాయణ, కాంప్లెక్స్ హెచ్ఎం నిజాముద్దీన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికతో ప్రయోగాత్మకంగా బోధించాలి
కోస్గి, జనవరి 4 : ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్ర ణాళికతో ప్రయోగాత్మకంగా బోధిస్తే చదువుపై మక్కువ చూ పుతారని జిల్లా విద్యాశాఖ మానేటరింగ్ అధికారి విద్యాసాగర్ అన్నారు. పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో బుధవా రం మండలస్థాయి టీఎల్ఎమ్ మేళా నిర్వహించారు. మం డలంలోని అయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రాథమిక స్థాయి పరిసరాల విజ్ఞానం, గణితశాస్త్రం తెలుగు, ఇంగ్లిష్ అంశాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. అ నంతరం ప్రదర్శించిన టీఎల్ఎంలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎంతో ఉపయోగం
నారాయణపేట రూరల్, జనవరి 4 : విద్యార్థులకు వి ద్యాబోధన అర్థవంతంగ జరిగేందుకు టీచింగ్ లర్నింగ్ మె టీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆదర్శ బీఈడీ కళాశాలలో మండలస్థాయిలో నిర్వహించిన టీఎల్ఎమ్ మే ళా ఇన్చార్జి డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై తిలకించారు. టీఎల్ఎంలతో విద్యార్థులకు బోధన చేసినట్లయితే సులభం అర్థమవుతుందన్నారు. మేళాలో 14 యూపీఎస్లు, 40 పీఎస్లు 140 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కా ర్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, నోడల్ అధికారి రాజేంద్రకుమార్, ఎంఈవో గోపాల్నాయక్, సైన్స్ అధికారి భా నుప్రకాశ్, వివిధ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.