వనపర్తి టౌన్, జనవరి 7: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మీట్లో వనపర్తి కేడీ ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తాచాటినట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పా టు చేసిన సమావేశంలో విద్యార్థులను అభినందించి మాట్లా డుతూ వాలీబాల్లో కళాశాల జట్టు మొదటి స్థానం సాధించగా, ఖోఖోలో బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి, షటిల్ డబు ల్స్లో బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి, షాట్పుట్లో తృతీయ సంవత్సరం విద్యార్థి శివ మొదటి స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కె.స్వాతి ప్రథమ, షాట్పుట్లో ఫార్మసీ విద్యార్థిని శ్రావణి ప్రథమ బహుమతి, 200 మీటర్ల పరుగు పందెంలో బాలుర విభాగంలో శశికాంత్ ద్వితీయ బహుమతి, 400 మీటర్ల పరుగు పందెంలో సంపత్ ద్వితీయ బహుమతి, కబడ్డీ బాలికల విభాగంలో ద్వితీయ బహు మతి, వాలీబాల్ బాలుర విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించిన అధ్యాపకులు మీనాక్షి, ఇద్దయ్య, ఆర్.స్వాతి, రవిలను అభినందించారు. విజేతలకు నిలిచి సత్తాచాటడం కళాశాలకు ఇది ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. అనంతరం విజేతలను ఆయన అభినందించారు.