నవాబ్పేట, జనవరి 24 : మండలంలోని చౌ డూర్ గ్రామ శివారులో ఇటీవల ప్రారంభించిన క్రషర్ మిషన్ పనులకు అనుమతి కోసం ఎన్వోసీ తీసుకునేందుకు ఏకంగా తన సంతకాన్నే ఫోర్జరీ చే శారని చౌడూర్ ఎంపీటీసీ గోపీకృష్ణ ఆరోపించారు. చౌడూర్ క్రషర్ మిషన్ పనులను వెంటనే నిలిపి వేయాలంటూ ఎంపీటీసీ గోపీకృష్ణతోపాటు చుట్టు పక్కల రైతులు బుధవారం తాసీల్దార్ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగానే క్రషర్ ఏర్పాటుతో ఏర్పడుతున్న నష్టాన్ని, అనర్థాలను వా రు తాసీల్దార్కు వివరించారు. మూడు నెలల కింద ట అక్కడ క్రషర్ ఏర్పాటు కోసం అక్కడి వ్యాపారి శివారెడ్డి ఎన్వోసీ సర్టిఫికెట్ కోసం అక్కడి రైతులను మోసం చేసి చౌడూర్ గ్రామానికి చెందిన ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకున్నారని తెలిపారు. ఇందులో ఆర్ఐ కిరణ్కుమార్ వ్యాపారికి సహకరించి రైతులను మోసం చేయడంలో కీలకపాత్ర పో షించాడని ఆరోపించారు. ఎన్వోసీ సర్టిఫికెట్ కో సం సంతకాలు తీసుకుంటున్నాం.. అని చెప్పకుం డా.. భూమి సర్వే కోసం అని మాటలు చెప్పి ఎన్వోసీ కోసం చౌడూర్కు చెందిన రైతులు రామకృష్ణగౌడ్, శ్రీను, లక్ష్మయ్య సంతకాలను తెల్లకాగితంపై తీసుకున్నారని తెలిపారు.
అలాగే ఎంపీటీసీ గోపీకృష్ణ సంతకం చేయకపోయినా వారే ఫోర్జరీ చేసినట్లు గోపీకృష్ణతోపాటు రైతులు తాసీల్దార్ ముందు వాపోయారు. ఇప్పడు క్రషర్ను బం ద్ చేయాలని జిల్లా అధికారుల వద్దకు వెళ్తే.. ఎన్వో సీ రద్దు చేస్తే క్రషర్ నిలిపివేస్తామని వారు చెబుతున్నారన్నారు. కాలుష్య కారకంగా మారనున్న క్రషర్ మిషన్ను నిలిపి వేయకపోతే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. అనంతరం తన సంతకం ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీటీసీ గోపీకృష్ణ నవాబ్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి వెం టనే పనులు నిలిపి వేయాలని కోరారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మల్లికార్జునరావు మాట్లాడుతూ రైతుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తాసీల్దార్ను కలిసిన వారిలో రైతులు చిన్న య్య, ఆంజనేయులు, నర్సింహులు, సాయిలు, సు దర్శన్, మల్లేశ్, భీమయ్య, జిలానీ, రామకృష్ణ, ల క్ష్మయ్య, జహంగీర్, చిర్ప నర్సింహులు, శివకుమా ర్, శ్రీను తదితరులు ఉన్నారు.