జడ్చర్ల, జనవరి 21 : బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 1972 -73లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కుర్వగడ్డపల్లి వద్ద సమావేశమయ్యారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అదే విధంగా నాటి ఉపాధ్యాయులను ఆహ్వానించి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాదేపల్లి మాజీ సర్పంచ్ సీతారాం, మురళి, శివకుమార్, ఖాదర్పాషా, డాక్టర్ ఫిరోజ్అలీ, శ్రీనివాసులు, శశికుమార్, నరేందర్, సుధాకర్, విజయలక్ష్మి, అరుణ, శార ద, సుశీల, విజయలక్ష్మి, నాటి ఉపాధ్యాయులు పాండురంగారావు, వి శ్వనాథం, వెంకటకృష్ణయ్య, రాములు తదితరులు ఉన్నారు.