గద్వాల అర్బన్/కోడేరు/అయిజ/గట్టు, మే 21 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గద్వాల మండలం జమ్మిచేడులో ఊరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల పెద్ద చెట్లు నేలకొరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డులో 50 ఏండ్ల నాటి వేపచెట్టు నేలకొరిగింది. అనంతపురం పెట్రోల్బంక్ వద్ద ఉన్న చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విష యం తెలుసుకున్న రూరల్ ఎస్సై పర్వతాలు ఘటనా స్థలికి చేరుకొని చెట్టును తొలగించారు. కోడేరు మండలంలోని నాగులపల్లితండాలో ఈదురుగాలులతో చె ట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కో డేరు, జనుంపల్లి, ఎత్తం, నర్సాయపల్లి, నాగులపల్లి, మైలారం, కొండ్రావుపల్లి గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. దీంతో మామిడి రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. చాలా గ్రామాల్లో మామిడి చెట్లు విరిగిపడ్డా యి. కొల్లాపూర్కు చెందిన కౌలు రైతు ఏకంగా కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్క తోటకు రూ.4 లక్షల వరకు యజమానికి చెల్లించానని.. తీరా చూస్తే గాలి వానకు కాయలు నేలరాలడంతో నష్టం జరిగిందన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలన చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అయిజ మండలంలోని పలు గ్రా మాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయిజ పట్టణంలోని పలు వీ ధుల్లో వర్షపు నీరు నిలిచింది. చెట్లు నేలకొరిగాయి. ప లు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గట్టు మండలంలోని బోయలగూడెం శివారులో పి డుగుపాటుకు కోలంట్ల తిమ్మన్నకు చెందిన ఎద్దు మృతిచెందింది. రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లిందని బా ధిత రైతు తెలిపాడు.