వనపర్తి టౌన్, జనవరి 12 : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ తారకమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. గురువారం మంత్రి నిరంజన్రెడ్డి కూతురు ప్రత్యూషరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆమె సూచించారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని పోటీలను ప్రారంభించామని చెప్పారు. అంతకుముందు స్వామి వివేకానంద, సింగిరెడ్డి తారకమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ శిక్షణ తరగతుల నిర్వాహకుడు పురుషోత్తంరెడ్డి, కౌన్సిల ర్ మహేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు గిరి, పరంజ్యోతి, మా ణిక్యం, జాత్రునాయక్, ప్రేమ్నాథ్రెడ్డి, నీలస్వామి, గౌడనాయక్ తదితరులున్నారు.