దేవరకద్ర, జనవరి 18 : రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మజ అన్నారు. దేవరకద్రలోని మండల మహిళా సమాఖ్య భవనంలో కంటివెలుగు శిబిరం ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి శిబిరాలకు తీసుకురావాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. 18ఏండ్లు నిండిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కండ్లద్దాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి టైటస్పాల్ అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటివెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కంటివెలుగు కార్యక్రమాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సమావేశంలో తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, డాక్టర్ శరత్చంద్ర, ఎస్సై భగవంత్రెడ్డి, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
కంటివెలుగు కార్యక్రమంపై వైద్యసిబ్బంది ఊరూరా విస్తృత ప్రచారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికెళ్లి పోస్టర్లను పంపిణీ చేశారు. అంధత్వ నివారణకు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భూత్పూర్, జనవరి 18 : కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని మండల వైద్యాధికారి అబ్దుల్ రబ్బు కోరారు. భూత్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమంపై బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కంటివెలుగు శిబిరాల నిర్వహణకు మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తె లిపారు. మున్సిపాలిటీలోని ఒకటోవార్డు రాందాస్తండా, మండలంలోని హస్నాపూర్లో గురువారం కంటివెలుగును ప్రారంభించనున్నట్లు చె ప్పారు. దృష్టిలోపంతో బాధపడుతున్న ప్రజలు కంటివెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్సై భాస్కర్రెడ్డి, ఎంపీవో విజయకుమార్, సూపర్వైజర్లు యాద మ్మ, సుధాకర్, ఏఎన్ఎంలు ఉన్నారు.
నవాబ్పేట, జనవరి 18 : కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో శ్రీలత కోరారు. మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బందికి కేటాయించిన వార్డుల్లో పర్యటించి ప్రజలను వైద్యశిబిరానికి తీసుకురావాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. కంటివెలుగు కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందర్నాయక్, జీహెచ్ఎం జగదీశ్కుమార్, ఏపీఎం జీవరత్నం, పంచాయతీ కార్యదర్శి రాకేశ్, రఘు పాల్గొన్నారు.
మూసాపేట, జనవరి 18 : కంటివెలుగు కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై అంధత్వ నిర్మూలనకు కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి రాధారోహిణి కోరారు. మూసాపేట తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అన్ని గ్రామాల్లో కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపా రు. ఇందుకు గ్రామాల వారీగా ప్రణాళికలను సి ద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో స్వరూప, ఎస్సై నరేశ్, ఎంపీవో సరోజ, ఏవో రాజేందర్రెడ్డి, మండల వై ద్యాధికారి శభానాబేగం, ఏపీఎం చారి ఉన్నారు.
గండీడ్, జనవరి 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని అంద రూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రూపేందర్రెడ్డి తెలిపారు. ఉమ్మడి గండీడ్ మండలంలోని జానంపల్లి, అంచన్పల్లి, మహ్మదాబాద్, చిన్నాయిపల్లి గ్రామాల్లో గురువారం కంటివెలుగు శిబిరాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కంటి సమస్యలు ఉన్న వారు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి కంటి మందులు, అద్దాలను అందజేయనున్నట్లు తెలిపా రు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.
మూసాపేట(అడ్డాకుల), జనవరి 18 : అడ్డాకుల మండల కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంపీపీ నాగార్జునరెడ్డి, సర్పంచ్ మంజుల బుధవారం ప్రకటనలో తెలిపారు. కంటివెలుగు శిబిరం నిర్వహణకు గ్రా మపంచాయతీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భూత్పూర్, జనవరి 18 : మండలంలోని హస్నాపూర్లో కంటివెలుగు కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ప్రారంభించనున్నట్లు ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు.
మిడ్జిల్, జనవరి 18 : రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల వైద్యాధికారి మనుప్రియ బుధవారం ప్ర కటనలో తెలిపారు. మండల కేంద్రంలో గురువా రం కంటివెలుగు శిబిరం ప్రారంభించనున్నట్లు పే ర్కొన్నారు. కంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వందరోజులపాటు నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.
జడ్చర్లటౌన్, జనవరి 18 : జడ్చర్ల మున్సిపాలిటీలో 38,250మందికి కంటి పరీక్షలు నిర్వహించి కండ్లద్దాలను పంపిణీ చేయడమే లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అ న్నారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవా రం అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద రో జులపాటు నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని అన్ని వార్డుల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు వార్డుల వారీగా కౌన్సిలర్లు అవగాహన కల్పించాలని కో రారు. అదేవిధంగా అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ము న్సిపాలిటీలో మొదటగా 1, 2 వార్డుల్లో కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు చె ప్పారు. ఇందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ సారిక, కమిషనర్ మహమూద్ షేక్, కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.