పాలమూరు, ఫిబ్రవరి 25 : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి ముందు మహబూబ్నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ రవినాయక్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని తేరు మైదానంలోకి పల్లకీలో తీసుకువచ్చి రథంలో ఉంచి ప్రత్యేక పూజలు చేయగా అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు.
రథాన్ని లాగేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పోటీ పడ్డారు. మన్యంకొండ మొ త్తం భక్తజనంతో నిండిపోవడమే కాకుండా గోవిం ద నామస్మరణతో మార్మోగాయి. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో రథోత్సవాన్ని తిలకించి తన్మయత్వానికి లోనయ్యా రు. రథోత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, చైర్మన్ మధుసూదన్కుమార్, ఈవో శ్రీనివాసరాజు, పర్యవేక్షకులు నిత్యానందచారి, ఆలయ కమిటీ స భ్యులు, అర్చకులు, సిబ్బందితోపాటు భక్తులు పాల్గొన్నారు.