శ్రీరంగాపూర్ క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిశాయి. రంగనాథస్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణ.. మేళతాళాలు మోగుతుండగా.. వేడుక నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి దర్శనంతో పరవశించిపోయారు. మంత్రి నిరంజన్రెడ్డి, ఆలయ ధర్మకర్త శ్రీకృష్ణదేవరావుతోపాటు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీరంగాపూర్, మార్చి 17 : శ్రీరంగాపూర్లోని రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. దీంతో క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసా యి. గోవింద నామస్మరణల మధ్య తేరు ఉత్సవం కనులపండువగా సాగింది. అంతకుముందు శ్రీదేవి, భూదే వి సమేతంగా శ్రీరంగనాథస్వామికి ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆలయ ధర్మకర్త శ్రీకృష్ణదేవరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఆవరణలోని రథం వద్దకు మేళతాళాల మోగుతుండగా.. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. పండితులు రతాంగపూజ నిర్వహించగా.. ఉత్సవ విగ్రహాలను రథంలో అధిష్ఠింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీకృష్ణదేవరావు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం రమణీయంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ గా తరలొచ్చారు.
స్వామిని స్మరించుకుంటూ రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. గోదాదేవి ఆలయం వరకు తేరు ఉత్సవం కొనసాగింది. అడుగడుగునా భక్తులు నీ రాజనాలు పలికారు. వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించగా.. శ్రీ రంగాపూర్ సేవా సమితి ఆధ్వర్యంలో భోజన వసతి, నాయకుడు అనూజ్ఞరెడ్డి మజ్జిగా ప్యాకెట్లు అందజేశారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ ఆనంద్రెడ్డి, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై మల్లేశ్ ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, ఎంపీపీ గాయత్రి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్స్వామి, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ బుచ్చారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు కోదండరాంరెడ్డి, సర్పంచ్ వినీలారాణి, నాయకులు ఉన్నారు.